ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐకి కొత్త బాస్..

national |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 08:08 PM

సీబీఐకి కొత్త బాస్ ఎంపికయ్యారు. ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లాను సీబీఐ చీఫ్‌గా నియమిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో సెలక్షన్ ప్యానెల్ శనివారం (ఫిబ్రవరి 2) నిర్ణయం తీసుకుంది. 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శుక్లా.. మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. ఆయన పదవీ కాలం మరో రెండేళ్ల పాటు ఉంది. సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న తెలుగు తేజం మన్నెం నాగేశ్వర రావు నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. సీబీఐలో అంతర్గత విభేదాలు సంస్థ ప్రతిష్టను మసకబార్చిన నేపథ్యంలో శుక్లాపై గురుతర బాధ్యత ఉంది.
సీబీఐ డైరెక్టర్‌గా పదవిలో కొనసాగిన అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని ఎదిరిస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. ఆ తర్వాత పరిణామాలతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలను తాత్కాలికంగా నాగేశ్వర రావుకు అప్పగిస్తూ.. సెలక్షన్ ప్యానెల్ జనవరి 10న నిర్ణయం తీసుకుంది.
సీబీఐకి కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకు నాగేశ్వర రావు ఆ బాధ్యతల్లో కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం జనవరి 10న ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఆ బాధ్యతల్లో నాగేశ్వర రావునే కొనసాగించవచ్చని అందరూ భావించారు. కానీ, కొత్త డైరెక్టర్‌ను ఎన్నుకొని ప్రధాని మోదీ అందర్నీ ఆశ్చర్యపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa