2014లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ మెగాస్టార్ చిరంజీవి పై వేసిన కేసును హైకోర్టు జడ్జి జస్టిస్ టి.రజనీ ఈ కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2014 ఏప్రిల్ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. గుంటూరు అరండల్పేట్ ఠాణాలో ఈ కేసు నమోదు కాగా ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న అధికారులు అక్రమంగా తనపై కేసు నమోదు చేశారని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలో నే ఈ కేసు ని న్యాయస్థానం కొట్టేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa