ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ మహిళా కమిషన్ కి అభినందనలు తెలిపిన లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 07:52 PM

సాక్షి ఛానెల్‌పై, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. 'మహిళా కమిషన్ చొరవను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అమరావతి మహిళలను ఉద్దేశిస్తూ కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్‌కు అభినందనలు. అమరావతి మహిళా రైతులను వేశ్యలగా అభివర్ణించడం సిగ్గుచేటు మాత్రమే కాదు.. నేరం కూడా. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సత్వరమే స్పందించి వేగంగా చర్య తీసుకోవడం ద్వారా అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదనే బలమైన సందేశం ఇచ్చింది. మేమంతా అమరావతి మహిళా రైతుల వెనుక ఉన్నాం. వారికి సత్వరమే న్యాయం జరగాలి' అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa