పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బండి నారాయణ (27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa