ప్రమాదకరంగా మారుతున్న ఏపీకే ఫైల్స్
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్తకోణంలో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ను ఉపయోగించి స్మార్ట్ఫోన్లపై నియంత్రణ సాధిస్తూ, వినియోగదారుల బ్యాంకు వివరాలు దోచుకుంటున్నారు. ఈ ఫైల్స్ ద్వారా వారు మీ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేసి, మీ డేటా, పాస్వర్డ్స్, ఓటీపీలు అందుకోవచ్చు.
హెచ్డీఎఫ్సీ బాంక్ తాజా హెచ్చరిక
ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ, వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఎవరో పంపిన ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేయవద్దని, అవి సైబర్ మోసాల అవకాశాన్ని పెంచతాయని స్పష్టం చేసింది. అనధికార వేదికల నుంచి వచ్చిన లింకులు, ఫైల్స్ చాలా ప్రమాదకరమని హెచ్చరించింది.
థర్డ్పార్టీ యాప్స్కి 'నో' చెప్పాలి
అధికారిక ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కాకుండా, ఇతర వేదికల నుంచి వచ్చిన థర్డ్ పార్టీ యాప్స్ను వాడకూడదని హెచ్డీఎఫ్సీ స్పష్టం చేసింది. అవి మీ ఫోన్లో అనధికార యాక్సెస్ పొందే ప్రమాదం ఉంది. బ్యాంకింగ్ యాప్స్ వాడేటప్పుడు అధికారిక వెబ్సైట్స్, యాప్ స్టోర్లను మాత్రమే ఉపయోగించాలి.
లింక్లు వచ్చినపుడు అప్రమత్తత అవసరం
మీ మొబైల్కు మెసేజ్ లేదా ఇమెయిల్ ద్వారా లింక్ వచ్చినపుడు, అది ఎవరి నుంచి వచ్చిందో నమ్మదగిన వారేనా అనే విషయంలో చెక్ చేసుకోవాలి. స్నేహితుల పేరిట వచ్చినా సరే, ముందుగా ధృవీకరించాలి. చిన్న అప్రమత్తతతో పెద్ద మోసాల నుంచి తప్పించుకోవచ్చని హెచ్డీఎఫ్సీ సూచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa