కర్నాటక అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు వేసిన మధ్యంతర పిటిషన్పై ఈ మేరకు స్పందించింది. కాంగ్రెస్-జేడీయూ పార్టీలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో… ఖాళీ అయిన 15 స్థానాల్లో వచ్చే నెల 21న ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికలకు నోటిషికేషన్ విడుదలైన నేపథ్యంలో దీనిపై స్టే విధించాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరారు. ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు తమను కూడా అనుమతించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల పిటిషన్పై స్పందించిన జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసం దీనిపై వివరణ ఇవ్వాలంటూ కర్నాటక రాష్ట్రానికి, అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa