అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తిరుమలకు చేరుకోనున్న సీఎం తిరుమలలో వకుళాదేవి వసతి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. రాత్రి ఏడు గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఎనిమిది గంటలకు పెదశేష వాహనం సేవలో పాల్గొననున్నారు. సోమవారం రాత్రికి పద్మావతి వసతి గృహంలోనే బసచేయనున్న సీఎం మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి విజయవాడకు రానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa