ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో సీపెట్‌ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2019, 06:18 PM

యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నూతనంగా నిర్మించిన సీపెట్‌ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) భవనాలను కేంద్ర మంత్రి సదానంద గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. సీపెట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు ఇచ్చేలా చట్టం చేశాం. మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దీన్ని తీసుకొచ్చాం. మన పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అన్నారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌లో శిక్షణ పొందినవారికి మంచి అవకాశాలున్నాయి. ఇలాంటి సంస్థలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తాం. కేంద్ర సాయం ద్వారా మరిన్ని అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రంలో మరో సీపెట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరా. త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు అని జగన్‌ తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa