పెన్షనర్లకు కేంద్ర సర్కార్ తీపికబురందించింది. 17 శాతం డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) అందించాలని తాజాగా నిర్ణయించింది. దీంతో డీఆర్ మొత్తం 5 శాతం పెరిగినట్లు అయ్యింది. ఈ డీఆర్ పెంపు నిర్ణయం 2019 జూలై నుంచే వర్తిస్తుంది. డిసెంబర్ వరకు అమలులో ఉంటుంది. పెంపు నిర్ణయం వల్ల పెన్షన్ మొత్తం రూ.450 నుంచి రూ.6,250 మధ్యలో పెరుగుతుంది. ‘కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం కింద డియర్నెస్ రిలీఫ్ను గరిష్ట స్థాయిలోనే పెంచింది. దీనికి సంబంధించి ఆర్డర్లు కూడా వెలువడ్డాయి’ అని ఏజీ ఆఫీస్ మాజీ ప్రెసిడెంట్ హరిశంకర్ తివారీ తెలిపారు. మినిమమ్ పెన్షన్ రూ.9000గా ఉందని, ఇప్పుడు డీఆర్ 5 శాతం పెంపు వల్ల వీరి పెన్షన్ రూ.450 పెరుగుతుందని తివారీ తెలిపారు. అలాగే రూ.1.25 లక్షల పెన్షన్ తీసుకునే వారికి పెన్షన్ మొత్తం రూ.6,250 పెరుగుతుందని పేర్కొన్నారు. 2017కు ముందు కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసింది. మినిమమ్ పెన్షన్ / ఫ్యామిలీ పెన్షన్ నెలకు రూ.9,000గా ఉంది. అలాగే పరిహార మొత్తాన్ని డబుల్ చేశారు. రూ.10.15 లక్షల నుంచి రూ.25.35 లక్షలకు పెంచారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి డియర్నెస్ అలవెన్స్ బాగానే పెరిగింది. 5 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో డీఏ ఇప్పుడు 17 శాతానికి ఎగసింది. ఈ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతం రూ.900 నుంచి రూ.12,500 మధ్యలో పెరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa