ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మహత్యలు సరికాదు...మీకు అండగా టీడీపీ ఉంది: బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2019, 08:46 PM

ఆంధ్రప్రదేశ్ లో పండగ పూట భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు కలకలంరేపాయి. గుంటూరుజిల్లా తెనాలిలో తాపీ మేస్త్రి నాగబ్రహ్మం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే మరో భవన నిర్మాణ కార్మికుడు వెంకట్రావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రతిపక్షం టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. తాజాగా ఈ ఆత్మహత్యలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో స్పందిస్తూ.. కార్మికులకు అడంగా ఉంటామని ధైర్యం చెప్పారు. ‘పండుగ వేళ భవన నిర్మాణరంగానికి చెందిన మేస్త్రీలు బ్రహ్మాజీ, వెంకట్రావుల ఆత్మహత్య వార్తలు నన్ను కలిచివేశాయి! ఇసుక కొరతతో పనుల్లేక కార్మికులు బలవన్మరణం పాలు కావడం ఆవేదనకు గురిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తోంది’అన్నారు.‘జీవితం ఎంతో విలువైనది, పోరాడి సాధించాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఇంకెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది. నేను ఉన్నాను. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడుదాం. ఇసుక అక్రమాలపై నిలదీద్దాం’అంటూ పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa