ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. జగన్ పాలన నచ్చిన ప్రత్యర్ధి పార్టీ నాయకులు కూడా చాలా మంది వైసీపీలో చేరిపోతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా టీడీపీనీ వీడబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా నిన్న వల్లభనేని బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో సమావేశమైన అనంతరం, ఏపీ సీఎం జగన్తో కూడా ఆయన భేటీ అయ్యారు. అయితే వంశీ వైసీపీలో చేరేందుకు జగన్తో చర్చించారని, అందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీలో చేరాలంటే వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే దానికి వల్లభనేని కూడా ఓకే చెప్పడంతో జగన్ ఆయనకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారట. అయితే వల్లభనేని రాజీనామా చేస్తే గన్నవరంలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నిక సీటును వంశీకీ కాదని ఆయన చేతుల్లో మొన్న ఓడిపోయిన యార్లగడ్డకు ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారని వంశీనీ రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఏది ఏమైనా వల్లభనేని మాత్రం త్వరలోనే వైసీపీ లోచేరుబోతున్నారని తేలిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa