ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసులకు భయపడే ప్రసక్తే లేదు : కేశినేని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 01:11 PM

కేసులకు భయపడే ప్రసక్తే లేదని, తెదేపాను ఎవరూ ఏమీ చేయలేరని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన పార్టీ విస్త్రృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని  అన్నారు. రాజధానిపై వైకాపా నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధానిని మారుస్తానని సీఎం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో భాగంగా మూడు రోజుల పాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa