బస్తా సిమెంట్ కంటే ఇసుక ధర ఎక్కువ కావడం జగన్నాటకమేనని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన కృష్ణా జిల్లా తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వైకాపా నేతల ఇసుక దోపిడీ జగన్ కు తెలియడం లేదా అని ప్రశ్నించారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందనటం అబద్ధమన్నారు. ఇసుక విధానం మార్చకుండా ఉంటే రాష్ట్రంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకునే వారు కాదన్నారు. తెదేపా హయంలో హాయిగా బతికిన ప్రజలు ఇప్పుడు కష్టాలు కొనితెచ్చుకున్నారన్నారు. 8నెలల్లో పట్టిసీమ పూర్తి చేశామని.. అదీ తెదేపా దూరదృష్టి అని చంద్రబాబు అన్నారు. ఇరిగేషన్ లో మీకు ఓనమాలు రావని జగన్ కు చెప్పామన్నారు. ఇప్పుడు తాను చెప్పిందే అనుసరించాల్సి వస్తోందన్నారు. దేశంలో రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెదేపానేనని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa