ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖ‌జానా నింపేందుకు రైతుపై భూమి శిస్తు భారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2019, 05:34 AM

రాష్ట్రంలో భూమి శిస్తును తిరిగి ప్ర‌వేశ పెట్ట‌డం ద్వారా ఖ‌జానాని నింపుకోవాల‌ని  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.  1983 తరువాత భూమి శిస్తును రద్దు చేసి నీటిపారుదల సౌకర్యం కల వాటికి మాత్రం నీటి తీరువా వసూలు చేస్తుండ‌గా  మూడున్నర దశాబ్దాల అనంతరం నీటి తీరువాతో పాటుగా  మాగాణి, మెట్ట అన్న తేడా లేకుండా అన్ని భూములకూ శిస్తు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.  


ఇప్ప‌టికే ఈ విష‌యంపై ఉన్నతాధికారులతో ఒక విడత సమావేశం పూర్తయింది. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతోనూ చర్చించి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించనున్నారు. శిస్తు వసూలు చేయడం ద్వారా కొంత ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడొచ్చని, యజమానికి భూమిపై బాధ్యత పెరుగుతుందని  చెబుతున్నారు. 


భూమి శిస్తు రెవెన్యూ శాఖ వసూలు చేసిన తరువాత పంచాయతీ, దేవాదాయ, వక్ఫ్‌ వంటి సంస్థలకు చెందిన భూములుంటే నిర్ణీత మొత్తాన్ని ఆయా శాఖలకు బదిలీ చేస్తారు. తరువాత దశలో నేరుగా ఆయా సంస్థలకు చేరే విధంగా మార్పు చేయనున్నారు. శిస్తు వసూలు కోసం మరోసారి సర్వే నెంబర్లన్నీ తనిఖీలు చేయనున్నారు. దీంతోపాటు జమాబందీని తీసుకురానున్నారు. ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ పేరుతో పూర్తిగా రికార్డులను ఆధునీకరించనున్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa