ఏపీ సర్కార్ వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి కాపు మహిళలు మాత్రమే అర్హులు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం కాపు మహిళలకు సంవత్సరానికి రూ.15 వేల చొప్పున ఐదు సంవత్సరాలకు రూ.75వేలు అందించనుంది. .కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం వర్తించనుంది. 45 ఏళ్ల నుంచి 60ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఈ సాయం అందనుంది. కాపు కులాల్లో ఉన్న పేద మహిళలను ఆదుకోవడం కోసం పెట్టిన పథకమిదని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ పథకానికి అర్హతలివే
- కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలు అర్హులు. వారి వయస్సు 45 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న వారు అర్హులు. అంతకు ఎక్కువ ఉంటే అర్హులు కాదు.
- 3 ఎకరా లోపు పల్లం భూమి, 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- కారు, ట్రాక్టర్ వంటి 4 వీలర్ వాహనాలు లేని దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు మాత్రమే వైఎస్సార్ కాపు నేస్తానికి అర్హులు.
- ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కాపు మహిళలు పథకానికి అనర్హులు.
- కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను కడుతున్నా ఆ కుటుంబంలోని మహిళలకు ఈ పథకం వర్తించదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa