ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి వివాహేతర సంబంధం...

national |  Suryaa Desk  | Published : Wed, Jun 03, 2020, 09:57 AM

ఆమె పేరు ధర్మశీలాదేవి.. చేసింది అధర్మం పనులు. వయస్సు 40 కి చేరుకున్నా తనకంటే  వయసులో చిన్నవాడైన యువకుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుందీ ఆంటీ. కొన్నాళ్ళకు తన వివాహేతర సంబంధం కొడుక్కి తెలిసిపోయిందని, ప్రియుడితో కలిసి కన్నకొడుకునే చంపి...మరో తప్పు చేసి జైలు పాలయ్యింది. పెళ్లై భర్త వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటుంటే...లైంగిక సుఖాల కోసం బరితెగించింది. పేగు బంధాన్నే తెంచేసింది బీహారీ మహిళ. 


బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లా  దేవరియా లో నివాసం ఉండే ధర్మశీలాదేవి (40) దంపతులకు ఇద్దరు కుమారులు. భర్త ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉంటున్నాడు.  పెద్ద కుమారుడు మనీష్ కుమార్ (12) హాస్టల్ లో ఉండి చదువుకుంటుంటే ...   ఐదేళ్ల చిన్న కుమారుడిని పెట్టుకుని ధర్మశీలాదేవి  ఇంటి దగ్గరే ఉంటోంది. భర్త దూరంగా ఉండటం ..... చిన్న కొడుకుతో ఇంట్లోనే ఉండటంతో  ఈ 40 ఏళ్ల  ఆంటీ స్ధానికంగా ఉన్న చందేష్ సింగ్ అనే  యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.


ఆమె గురించి పట్టించుకునే వారు కూడా లేక పోవటంతో యువకుడితో రెచ్చి పోయి ఎంజాయ్ చేసేది. దానికి తోడు గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ కూడా ఉండటంతో ఎక్కువ సేపు చందేష్ సింగ్ ఆమె వద్దే గడిపేవాడు . లాక్ డౌన్ వారిద్దరికి బాగా  కలిసి రావటంతో  ఇద్దరూ శృంగారంలో తేలియాడి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ పొడిగింపు కార్యక్రమంలో భాగంగా ఇటీవల ధర్మశీల పెద్ద కుమారుడు  మనీష్కుమార్ ఇంటికి వచ్చాడు. దీంతో ధర్మశీల, చందేష్ సింగ్ ల రాసలీలలకు చిన్న బ్రేక్  పడింది. అయినప్పటికీ కొడుకు కంట పడకుండా వారిద్దరూ కలుసుకోటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.


 


 ఇన్నాళ్లు స్వేఛ్చా జీవుల్లా ఆనందించిన వారికి కొడుకు రావటం కాస్త ఇబ్బందిగా మారింది.  ఇదివరకటిలా ప్రియుడ్ని కలిసి ఆనందించలేక పోతోంది.ఈక్రమంలో విరహతాపంతో ఉన్న ఆంటీ...మే 8వ తేదీన కొడుకు ఆడుకోటానికి బయటకు వెళ్లినప్పుడు ప్రియుడు  చందేష్ సింగ్ ను రమ్మని ఫోన్ చేసింది. ఎప్పుడెప్పుడు ఆంటీతో రొమాన్స్ చేద్దామా అని ఎదురు చూస్తున్న చందేష్ వెంటనే ధర్మశీల ఒడిలో వాలిపోయాడు. ఇద్దరూ ఆనందపు అంచులు చవిచూశారు.కాలం కలిసిరాకపోవటం అటే ఇలాగే ఉంటుందేమో .. ఉన్నట్టుండి మనీష్ కుమార్ ఇంటికి వచ్చాడు. తల్లి మరోక యువకుడితో అసభ్యకరమైన పరిస్ధితిలో ఉండటం చూశాడు. కొడుక్కి తన అక్రమ సంబంధం గురించి తెలిసిపోయిందని గ్రహించిన తల్లి  కాస్త భయపడింది. ప్రియుడితో కలిసి ఆలోచించింది. కొడుకును చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడు మోజులో సుఖానికి అలవాటు పడ్డ ఆంటీకి పేగుబంధం గుర్తుకు రాలేదు. ప్రియుడు చందేష్ సింగ్,అతని స్నేహితుడు దయాశంకర్ ల సహాయంతో కొడుకును  కిరాతకంగా చంపింది.


 


 


తర్వాత ఏమీ ఎరగనట్టు  తనబిడ్డను ఎవరో చంపేశారంటూ ఏడుపు మొదలెట్టింది. సమాచారం తెలుసుకున్న భోర్ పోలీస్ స్టేషన్.. పోలీసులు ఘటనాస్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ఘటనా స్ధలంలో ఆధారాలు సేకరించి విచారణ మొదలెట్టారు. విచారణలో ఆంటీ అక్రమ సంబంధం ....రాసలీలలు వెలుగు చూశాయి. ధర్మశీలాదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితురాలు అసలు విషయం బయటపెట్టింది. ఆమెకు సహకరించిన ప్రియుడు, అతని మిత్రుడ్నిపోలీసులు అరెస్టు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa