కేంద్ర ప్రభుత్వం తాజాగా తన ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చింది. ఇంక్రిమెంట్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకు పెంపు ఉండదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఒక ఆర్డర్ కూడా జారీ చేసింది. దీంతో లక్షల మంది ఉద్యగులపై ప్రభావం పడనుంది.2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల వార్షిక పనీతీరు అంచనా గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం ఈ గడువును ఇది వరకు డిసెంబర్ 2020 వరకు మాత్రమే పొడిగించింది. ఇప్పుడు మార్చి 31ను తాజా డెడ్లైన్గా నిర్ణయించింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోసం మార్చి 2021 వరకు వేచి ఉండాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa