గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత రాజకీయ పార్టీ లు కుమ్మక్కు అయ్యి రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని అన్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుచుకుంటుందన్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల పార్టీ అని, అందరికి ప్రాతినిధ్యం కల్పిస్తుందన్నారు. ఆర్ధిక స్థితితో సంబంధంతో లేకుండా అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. అందులో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పారు. జాతీయ ప్రధాన కార్యదర్శి ఆకురాతి మురళి కృష్ణ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్ మూడు రాజధానులు అనే నినాదంతో వెళ్తున్నారని దీన్ని విరమించుకోవాలని, రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి ఆకురాతి మురళి కృష్ణ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం సాధించడం కోసం, అన్ని కులాల ప్రజలకు పేదరికం, సామాజిక అసమానతలను నిర్ములించేందుకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. మతసామరస్యాన్ని కాపాడుతూ అసలైన సెక్యులరిజం సాధించడం కోసం పార్టీ పనిచేస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa