ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిధి దాటొద్దు.. నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 06, 2021, 04:35 PM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై ఏపీ ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఈసీ వివాదాస్పదంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడింది. వివాదాస్పదంగా మారి ఎన్నికల కమిషన్ అనే వ్యవస్థను అప్రదిష్టపాలు చేస్తున్నారంటూ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిలువరించాలనుకోవడం అప్రజాస్వామికం..దురదృష్టకరమన్నారు. నిమ్మగడ్డ రమేష్ తన పరిధి దాటి చర్యలు తీసుకుంటున్నారని.. ఇలాంటి నిర్ణయాలవల్ల ఎన్నికల కమిషన్ అబాసుపాలు అవుతుందన్నారు.
ఎన్నికల కోసం యాప్ ప్రవేశపెట్టిన నిమ్మగడ్డ ఇప్పటికే కోర్టులో ఇబ్బంది పడ్డారని ఆవిషయాన్ని గుర్తు చేశారు. పెద్దిరెడ్డి పై జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే న్యాయాపోరాటానికి వెళతామని హెచ్చరించారు. పంచాయితీ ఎన్నికల్లో శాంతి సామరస్యంగా జరిగే ఏకగ్రీవాలను నిలిపివేయాలని ఉత్తర్వులు ఇవ్వడం మంచిపద్దతి కాదని ఇకనైనా ఆయన వైఖరి మార్చుకోవాలని కాకాని గోవర్థన్ రెడ్డి హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa