టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణతో నంద్యాల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికంగా ఉన్న సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద ఇరు వర్గాలకు చెందిన శ్రేణులు రెచ్చిపోయి, దాడులకు తెగబడ్డాయి. వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ నేత అభిరుచి మధుల అనుచరులు బాహాబాహీకి దిగారు. పరస్పరం రాళ్ల దాడికి తెగించారు. ఈ నేపథ్యంలో మధుకు చెందిన ఆడీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, మధు ఓ రౌడీ షీటర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ గన్ మెన్ తో తమపై కాల్పులు జరిపించాడని అన్నారు. కారును పక్కకు తీయాలని అడిగినందుకే ఇంతగా రెచ్చిపోయాడని మండిపడ్డారు. అధికార పార్టీ నేతననే ధైర్యంతో దారుణంగా వ్యవహరించాడని నిన్న తమ పార్టీ కౌన్సిలర్ ను కూడా కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సూరజ్ హోటల్ వద్ద 144 సెక్షన్ ను విధించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై కాల్పులు జరిపారని వైఎస్ఆర్ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. ఘటనపై ‘కాల్పులు జరిపింది అభిరుచి మధునే. మధు చేతిలో గన్తో మాపైకి దూసుకు వచ్చాడు. చుట్టు ఉన్నవారు నిలువరించడానికి ప్రయత్నించినా మధు ఆగలేదు. అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే అటకాయించారు. మా వాహనాలను ముందుకు వెనక్కి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదేంటని మా వాళ్లు ప్రశ్నిస్తే.. మీ సంగతి చూస్తామన్నారు. మీ సంగతి తేల్చడానికే ఇక్కడికి వచ్చామని బెదిరించారు. వాళ్ల చేతుల్లో గన్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa