ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది అపురూప ఘట్టం. కానీ ఆ దేశంలో యువత పెళ్లి చేసుకోవడం లేదు.. చేసుకున్న వాళ్ళు ఏమో పిల్లలను కనడానికి ఇష్ట పడడం లేదు.. కారణం ఏంటా..?అంటే.. దక్షిణ కొరియాలో దాదాపు సగం మంది నూతన వధూవరులకు పిల్లలు లేరు. దీంతో దేశంలో జనన రేటు బాగా తగ్గింది. మారుతున్న సామాజిక నిబంధనల మధ్య ఈ వివరాలు బయటకు వచ్చాయి.
దేశంలోని 1.18 మిలియన్ల జంటలలో 44.5 శాతం మందికి పిల్లలు లేరు. నవంబర్ 2020 వరకు ఐదేళ్లలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారిలో ఎక్కువ మందికి సంతానం లేదు. ఇక గత సంవత్సర కాలంలో పెళ్లిళ్లు చేసుకున్న వారిలో 42.5 శాతం మందికి ఇంకా పిల్లలు లేరని తాజా డేటా తెలిపింది. దేశంలో కొత్తగా పెళ్లయిన జంటలు పిల్లలు కనడానికి వెనకాడుతూ ఉన్నారని డేటా ద్వారా తెలిసింది.
కొత్తగా పెళ్లయిన పిల్లలతో ఉన్న జంటల నిష్పత్తి 2015లో 64.5 శాతం నుంచి 2016లో 63.7 శాతానికి, 2017లో 62.5 శాతానికి, 2018లో 59.8 శాతానికి క్రమంగా తగ్గుముఖం పట్టింది. నూతన వధూవరులకు జన్మించిన శిశువుల సంఖ్య మునుపటి సంవత్సరం 0.71 నుండి 2020లో 0.68కి పడిపోయింది. ఆర్థిక ఇబ్బందులు మరియు మారుతున్న సామాజిక నిబంధనల కారణంగా చాలా మంది యువకులు వివాహాన్ని ఆలస్యం చేస్తుండటమే కాకుండా.. పెళ్లి చేసుకోవడం మానేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పిల్లలను కనడం మానేస్తుండటంతో దక్షిణ కొరియా ప్రసవాల క్షీణతతో ఇబ్బందులు పడుతూ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa