న్యూఢిల్లీ: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కీలకమైన రక్షణశాఖను నిర్మలా సీతారామన్కు కేటాయించారు. కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందిన ఆమెకు.. ఇంతటి కీలకమైన శాఖ కేటాయించడం గమనార్హం. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళ నిర్మలా సీతారామన్. గతంలో 1975, 1980 నుంచి 1982 వరకు రెండుసార్లు ఇందిరాగాంధీ రక్షణశాఖ బాధ్యతలు చేపట్టారు. మనోహర్ పారికర్ రాజీనామా తర్వాత ఇప్పటివరకు రక్షణ శాఖ అదనపు బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చూస్తున్న విషయం తెలిసిందే. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా ఆయనకే రక్షణశాఖ బాధ్యతలు అప్పగించినట్లు ముందు వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఆ శాఖను నిర్మలకు కేటాయించారు. ఇక రైల్వేమంత్రిగా రాజీనామా చేసిన సురేశ్ ప్రభుకు వాణిజ్య శాఖ, ధర్మేంద్ర ప్రధాన్కు కేబినెట్ మంత్రి హోదాలో పెట్రోలియం శాఖ బాధ్యతలు అప్పగించారు. కొత్త మంత్రులు అల్ఫోన్స్ కన్నన్ థానం కు స్వతంత్ర హోదా లో టూరిజం, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, రాజ్ కుమార్ సింగ్ కు స్వతంత్ర హోదా లో విద్యుత్ శాఖ, హర్ దీప్ సింగ్ పూరీ కు స్వతంత్ర హోదా లో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, శివ ప్రతాప్ శుక్లా - ఆర్థిక సహాయ మంత్రి, నితిన్ గడ్కరీ - గంగా ప్రక్షాళన, జలవనరుల అదనపు బాధ్యతలు, నరేంద్ర సింగ్ తోమర్ - గనుల శాఖ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ -మైనార్టీ వ్యవహారాల శాఖ, ఉమా భారతి - తాగునీరు, పారిశుధ్య శాఖ ను కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa