మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తి కాగానే ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు బయల్దేరారు. చైనా నేతృత్వంలో క్సియమెన్ లో ఈ నెల 3 నుంచి 5 వరకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన బయల్దేరారు. అయితే ఈ దేశల అధినేతలు 3న చైనా చేరుకోనున్నారు. 4న బ్రిక్స్ సమావేశంలో సహకారం, సమస్యలు, పరిష్కారాలు, భవిష్యత్ చర్యలపై చర్చలు చేపడతారు. 5న తిరిగు ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని మూడు రోజుల పర్యటనకు చైనా బయల్దేరారు. అనంతరం 5న మూడు రోజుల పర్యటనకు మయన్మార్ వెళ్లనున్నారు. మయన్మార్ లో మోదీ చేపట్టనున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం. మయన్మార్ దేశాధ్యక్షుడు యు హ్తిన్ క్యావ్, స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూచీతో కలిసి మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు. మోదీ వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా మయన్మార్ తో స్నేహసంబంధాలు పెంచుకుంటున్నారు. చైనాతో ఆ దేశానికి సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa