ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఇంగ్లీష్ మీడియం బోధనతో భాషా సమస్య!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 09:08 AM

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధన తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భాషా సమస్య ఏర్పడుతోందని జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి 2019-20 వార్షిక నివేదికలో పేర్కొంది. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను పిల్లలు అర్థం చేసుకోవడంలో లోపం కనిపిస్తోందని వెల్లడించింది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్ సీఈఆర్టీ ఏపీలో నిర్వహించిన అధ్యయన నివేదికను విడుదల చేసింది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేసుకుంటున్నా అమలు చేయడంలో విఫలం అవుతున్నారని, ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలున్నా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఏం నేర్పాలి? ఏం నేర్చుకుంటున్నారు? అన్న విషయంలో స్పష్టత లోపించిందని తెలిపింది. విద్యాహక్కు చట్టం ద్వారా హాజరు శాతం పెరిగినట్లు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa