ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 03:46 PM

విశాఖపట్నం: అరకులోయ మండలంలో గల పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐగా టి. మల్లేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటక కేంద్రమైన అరకులోయలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఎటువంటి గొడవలు జరిగిన అపరిచిత వ్యక్తులు సందర్శించిన వెంటనే తమకు ఫిర్యాదు చేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa