ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఓటర్ల జాబితాలో మహిళలే ఎక్కువ..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 02:27 PM

ఏపీలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 4,62,880 మంది అదనంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో పురుష ఓటర్లు 2,01,34,664 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,05,97,544 మంది ఉన్నారు. ఒక్క శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,36,279 గా ఉంది. వీరిలో 4,071 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు కూడా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 43,45,322 మంది ఓటర్లు ఉన్నారు.


ఆ తర్వాత గుంటూరు జిల్లా 40,89,216 మంది, విశాఖపట్నం జిల్లా 37,19,438 మంది ఓటర్లతో నిలిచాయి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 19,02,077 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ప్రతి 1000 మందికి 743 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 1,026 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే యువ ఓటర్ల సంఖ్య 2,07,893గా ఉంది. రాష్ట్రంలో 2019 సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో పోలిస్తే అదనంగా 13,85,239 మంది ఓటర్లు పెరిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa