ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెరిటేజ్ లోనే ధరలెక్కువ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 10:00 PM

నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు చెప్పే రేట్ల కంటే హెరిటేజ్‌లో ధరలు ఎక్కువుగా ఉన్నాయంటూ లిస్ట్ చదివి వినిపించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే.. ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్లిపోతానంటూ కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. బ్లాక్ మార్కెట్ చేసే దొంగ చంద్రబాబు అంటూ కొడాలి నాని పరుష పదజాలంతో విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరలపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని.. చంద్రబాబు చెప్పే రేట్ల కంటే హెరిటేజ్‌లో నిత్యవసరాల ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు వైఎస్సార్ హయాంలోనే వేశారని.. చంద్రబాబు వేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానన్నారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలంటే.. చంద్రబాబును పక్కన పెట్టాలని కొడాలి నాని సలహా ఇచ్చారు. ఒకవేళ చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రాన్ని వదిలిపోతానన్నారు. చంద్రబాబు ఓడిపోతే హైదరాబాద్‌లో.. మీ ఊర్లోనో ఉంటావా అంటూ వ్యగ్యాస్త్రాలు సంధించారు. ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ చంద్రబాబని.. అదృష్టం జగన్ అని కొడాలి నాని అన్నారు. రాంగోపాల్ వర్మకు కొడాలి నాని తెలియకపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదని.. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉందని.. ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారని ఇప్పుడే చాలా మందికి తెలుస్తుందని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa