అనంతపురం: వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండున్నర ఏళ్ల నాటి నుండి ప్రతి విషయంలోనూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం పుట్టపర్తి మండల పరిధిలోని నిడిమామిడి పంచాయితీలో గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ధరల పెరుగుదల సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని, ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేస్తున్నారని తెలిపారు.
అంతేకాక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబులదేవరచెరువు బుక్కపట్నం కొత్తచెరువు పెడపల్లి గ్రామాల్లో మీరు చేసిన కబ్జాల గురించి చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని. జేబులు నింపు కోవడం తప్ప నియోజకవర్గం అభివృద్ధి కి చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి తప్పా మరి ఏమీ లేదన్నారు.
నియోజకవర్గం పరిధిలోని ప్రజలను ను తమ సొంత కుటుంబాల సభ్యులుగా చూసు కొన్నామని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పట్టణంలో స్థలాల గొడవలు లేపుతున్నారు స్మశాన వాటిక స్థలం మూడున్నర ఉంటే అది 7: 30 ఎకరం అని చెబుతున్నారని నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎవరూ ఏమి చేశారో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని పిలుపునిచ్చారు.
అంతేకాక గతంలో కొన్ని తప్పులు జరిగాయని పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మండల కన్వీనర్లు విజయ్ కుమార్, కొత్తచెరువు నరసింహులు, శ్రీ రామి రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఐ టి డి పి నియోజకవర్గ అధ్యక్షులు జయ ప్రకాష్ , తెలుగు యువత మనోహర్, బేకరీ నాయుడు, మురారి, కేశవ నాయుడు, మాజీ ఎంపిటిసి లు నాగిరెడ్డి, సన్నాయప్ప, నిడిమామిడి వీరభద్ర, బాబు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa