ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సీఎం జగన్ ను కలవనున్న మెగాస్టార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 13, 2022, 11:48 AM

ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం కలవనున్నారు. ఏపీలో సినిమా టికెట్ల విషయంపై సీఎం జగన్ తో చిరంజీవి చర్చించనున్నారు. సినిమా టికెట్ల ధరల వివాదం ముదురుతున్న కారణంగా చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలిసేందుకు చిరంజీవికి సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఇరువురు కలిసి లంచ్‌ చేయనున్నారు. సీఎం జగన్‌ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి చిరు చర్చించే అవకాశం ఉంది. సినీ పరిశ్రమపై పలువురు వైసీపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను చిరంజీవి సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa