మార్చి 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం మంగళగిరి మండలంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండు స్థలాలను పార్టీ నాయకులు, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసులు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు పరిశీలించారు.
మంగళగిరి మండలంలోని కాజ టోల్గేట్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ స్థిరాస్తి సంస్థకు చెందిన స్థలాన్ని, డీజీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న మరో స్థలాన్ని వారు పరిశీలించారు. కాగా కాజ వద్దనున్న స్థలమే సభ నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఆవిర్భావ సభకు సుమారు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa