మొగల్రాజపురం లోని టీడీపి పోలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు ఇంటి వద్ద విలేకర్ల సమావేశం జరిగింది. టిడిపి పై విష ప్రచారం చేయడమే కొడాలి నాని పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు, అతని కుటుంబ సభ్యులు ను తిట్టే పనిని జగన్ కోడలి నానిజి అప్పగించారా అని ప్రశ్నించారు. యన్టీఆర్ జిల్లాగా పేరు పెడితే టిడిపి అడ్డుకుంటుంది అని కొడాలి నాని అన్నాడు. నీ అమ్మ మొగుడు నీకు చెప్పాడా. టిడిపి అడ్డుకుందని.!! తెలుగుదేశం పై అసత్యాలు ప్రచారం చేయడమే కొడాలి నాని పని ఐపోయింది అని, నీ శాఖలొ ఉన్న తప్పులు, లెక్కలు పై కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు తలవందే కొడాలి నానికి నిద్ర పట్టదు. చివరకి ఇంట్లో అడవాళ్లని దిగజారి వ్యాఖ్యలు చేయడానికి నానికి సిగ్గుండాలి. యన్టీఆర్ పేరు ను విజయవాడ కు ప్రభుత్వం ప్రకటించింది. నిమ్మకూరు, గుడివాడ ప్రాంతాలు ఉన్న వైపు యన్టీఆర్ పేరు పెట్టాలని మేము చెప్పాం. అది వదిలేసి మేము వద్దన్నామని నీ బ్లూ మీడియా లో ప్రచారం చెయ్యడం సిగ్గుచేటు అన్నారు.
ఫేక్ పార్టీ, ఫేక్ మంత్రి కొడాలి నానిఆయన బతుకే ఫేక్ బతుకు అన్నారు. దమ్ముంటే మేము యన్టీఆర్ పేరు వద్దన్నట్లు సాక్ష్యాలు చూపించు. లేదా నోరు మూసుకుని వాస్తవాలు మాట్లాడటం అలవాటు చేసుకో అని మండిపడ్డారు. అర్ధరాత్రి అశోక్ బాబు అరెస్టు చేయడం ఏమిటి అని, ఈ ప్రభుత్వానికి కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా బుద్ది రావడం లేదు అని, దున్నపోతు మీద వర్షం పడిన చందంగా వైసిపి తీరు ఉంది అని, క్యాసినో పెట్టి, అమ్మాయిలతో డ్యాన్స్ లు చేయించి నాని పై కేసు లేదు. విచారణ అధికారి ఏమయ్యారు. డిజిపి నోరు మెదపరు రౌడీయిజం, క్రైమ్ ను అధికారికంగా చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 225జీవో ఇచ్చి ప్రజలను బయపెడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు సిఎం కావడం ఖాయం. ఇళ్లకు ఎవరూ డబ్బు చెల్లించనక్కర్లేదు.
టిడిపి వచ్చాక ఫ్రీగా మీకు హక్కులు కల్పిస్తాం. తూర్పు కృష్ణాకు యన్టీఆర్, పశ్చిమ కృష్ణాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని నేను దీక్ష చేశాను. ఇందులో ఎక్కడా పార్టీ జెండాలు నేను కట్టలేదు అని, నా దీక్షకు అన్ని పార్టీ ల నాయకులు వచ్చి మద్దతు ఇచ్చారు. కొడాలి ఓట్ల కోసం రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమం చేస్తారు. రంగా పేరుతో జిల్లా పెట్టాలని జగన్ ను అడిగే దమ్ము నానికి లేదు. నిన్న నాని విజయవాడ కు యన్టీఆర్ పేరు పెట్టాం అన్నారు. తూర్పు కృష్ణాకు అయినా వంగవీటి మోహనరంగా పేరు పెట్టించాలని నానిని డిమాండ్ చేస్తున్నాం. ఎపి లో కులాల మధ్య చిచ్చు పెట్టేదే వైసిపి. ప్రజా ప్రయోజనాల కోసం కన్నా రాజకీయ ప్రయోజనాలే వైసిపికి ముఖ్యం అన్నారు. వైసిపి రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా 26జిల్లాలు అని ప్రకటించింది అన్నారు. ఉన్న ఒక్క రాజధాని నాశనం చేసి మూడు రాజధానులు అభివృద్ధి అన్నారు. మూడేళ్లలో మళ్లీ ఎపి రాజధాని అంటే చెప్పలేని పరిస్థితి కి తెచ్చారు. మెజారిటీ ఉందనే అధికారమదంతో జగన్ పాలన చేస్తున్నారు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa