ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రయాణికులకు అలెర్ట్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 09:26 AM

రైల్వే ట్రాక్‌ల మరమ్మతుల కారణంగా చెన్నై-గూడూరు మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు.. మరికొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.అంతేకాకుండా పలు రైళ్లను పాక్షికంగా (Trains Cancelled) రద్దు చేసినట్లు వెల్లడించింది. చెన్నై - గూడురు సెక్షన్‌లో ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెల్లూరు - సూళ్లూరుపేట, సూళ్లూరుపేట - నెల్లూరు మధ్య నడిచే మెమూ రైళ్లను (06746 - 06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా.. విజయవాడ - చెన్నై సెంట్రల్‌ చెన్నై సెంట్రల్‌ - విజయవాడ (12711 - 12712) రైళ్లను ఈ నెల 22న గూడూర్-చెన్నై సెంట్రల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. హైదరాబాద్‌ - తాంబరం (12760) మధ్య నడిచే రైలును ఈ నెల 26న చెన్నైబీచ్‌-తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.


 


దారి మళ్లించిన రైళ్ల వివరాలు..


 


∙ పుదుచ్చేరి - న్యూఢిల్లీ (22403) ఎక్స్‌ప్రెస్‌ - ఈ నెల 16న చెంగల్‌పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్‌ల మీదుగా దారిమళ్లింపు.


 


∙ ఇండోర్‌ - కొచువేలి ఎక్స్‌ప్రెస్‌ (22645) - ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్‌ మీదుగా మళ్లింపు.


 


∙ ధన్‌బాద్‌ - అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ (13351) - ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారిమళ్లింపు.


 


∙ కాకినాడ - చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ (17644) - ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు.


 


∙ కాకినాడ - చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ (17652) - ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు.


 


∙ చెన్నై ఎగ్మోర్‌ - ముంబై సీఎస్‌టీ ఎక్స్‌ప్రెస్‌ (22158) - ఈ నెల 27న తాంబరం, చెంగల్‌పట్టు మీదుగా దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa