రైల్వే ట్రాక్ల మరమ్మతుల కారణంగా చెన్నై-గూడూరు మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు.. మరికొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.అంతేకాకుండా పలు రైళ్లను పాక్షికంగా (Trains Cancelled) రద్దు చేసినట్లు వెల్లడించింది. చెన్నై - గూడురు సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెల్లూరు - సూళ్లూరుపేట, సూళ్లూరుపేట - నెల్లూరు మధ్య నడిచే మెమూ రైళ్లను (06746 - 06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా.. విజయవాడ - చెన్నై సెంట్రల్ చెన్నై సెంట్రల్ - విజయవాడ (12711 - 12712) రైళ్లను ఈ నెల 22న గూడూర్-చెన్నై సెంట్రల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. హైదరాబాద్ - తాంబరం (12760) మధ్య నడిచే రైలును ఈ నెల 26న చెన్నైబీచ్-తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
దారి మళ్లించిన రైళ్ల వివరాలు..
∙ పుదుచ్చేరి - న్యూఢిల్లీ (22403) ఎక్స్ప్రెస్ - ఈ నెల 16న చెంగల్పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్ల మీదుగా దారిమళ్లింపు.
∙ ఇండోర్ - కొచువేలి ఎక్స్ప్రెస్ (22645) - ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్ మీదుగా మళ్లింపు.
∙ ధన్బాద్ - అలప్పుజ ఎక్స్ప్రెస్ (13351) - ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారిమళ్లింపు.
∙ కాకినాడ - చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ (17644) - ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు.
∙ కాకినాడ - చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ (17652) - ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు.
∙ చెన్నై ఎగ్మోర్ - ముంబై సీఎస్టీ ఎక్స్ప్రెస్ (22158) - ఈ నెల 27న తాంబరం, చెంగల్పట్టు మీదుగా దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa