ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5-15 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఎప్పుడంటే?

national |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 09:46 AM

భారత్ లో ప్రస్తుతం కరోనా టీకాల పంపిణీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15 ఏళ్లు పై బడిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఇక 15 ఏళ్లు లోపు పిల్లలకు టీకాలు వేయడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకాలపై నిపుణుల బృందం సిఫారసు చేసిన వెంటనే వ్యాక్సిన్లు వేస్తామని తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఎలాంటి సిఫారసు చేయలేదని వెల్లడించారు. ఏ ఏజ్‌ గ్రూప్‌కు టీకాలు ఎప్పుడు వేయాలో శాస్త్రవేత్తల బృందం సిఫారసుల ఆధారంగానే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.


5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు వేయాల్సిన టీకాపై నిపుణుల బృందం ఇప్పటి వరకు ఎలాంటి సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు. 'టీకాలు వేయడం సమస్య కాదు. మా దగ్గర సరిపడా వ్యాక్సిన్‌లు ఉన్నాయి. డోస్‌ల కొరత లేదు. కానీ, మేం ఖచ్చితంగా సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క సిఫార్సును అనుసరిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ఇంతవరకు ఎలాంటి సిఫారసు రాలేదని, దాని ఆధారంగానే రానున్న రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa