ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా వీసాకు కొత్త బాండ్ విధానం.. బంగ్లాదేశ్ సహా 38 దేశాలకు ట్రంప్ ఝలక్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 10:15 PM

బిజినెస్ (B1) లేదా టూరిస్ట్ (B2) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా షాకిచ్చింది. ఎంపిక చేసిన కొన్ని దేశాల పౌరులకు 'వీసా బాండ్' విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం వీసా జారీకి ముందు 5,000 నుంచి 15,000 డాలర్ల (సుమారు రూ.4.5- నుంచి రూ.13.6 లక్షలు) వరకు బాండ్‌ను దరఖాస్తుదారులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పైలట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తం 38 దేశాలను అమెరికా విదేశాంగ శాఖ ఎంపిక చేసింది. బంగ్లాదేశ్, నేపాల్, ఫిజీ, టాంజానియా, భూటాన్, అల్జీరియా, అంగోలా, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా, నైజీరియా, అల్జీరియా, క్యూబా, ఉగాండా, వెనుజులా, జాంబియా, జింబాబ్వే, తజికిస్థాన్ వంటి దేశాలు ఉన్నాయి. కానీ, ఈ పైలట్ ప్రాజెక్ట్ నుంచి భారత్‌ను మినహాయించడం గమనార్హం. ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాల పౌరులకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటికే హెచ్-1 బి వీసా నిబంధనల్లోనూ మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.


 నిర్ణయిస్తారు. అవసరమని భావిస్తే 5,000, 10,00 లేదా 15,000 డాలర్ల వరకు ఎంత మొత్తం డిపాజిట్‌గా చెల్లించాలనేది వారే నిర్దేశిస్తారు. అనంతరం హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఫారం I-352ను దరఖాస్తుదారుడు పూర్తిచేసి, యూఎస్ ట్రెజరీ ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే ఈ మొత్తాన్ని చెల్లించాలి. థర్డ్-పార్టీ వెబ్‌సైట్ల ద్వారా ఈ చెల్లింపులు చేయవద్దని, అలాంటి వాటికి తాము బాధ్యత వహించబోమని స్పష్టం చేసింది. కాన్సులర్ సిబ్బంది సూచన చేయకుండా డిపాజిట్ చెల్లిస్తే ఆ మొత్తం తిరిగి రాదని తెలిపింది. ముఖ్యంగా, డిపాజిట్ చెల్లించినంత మాత్రాన వీసా మంజూరు అయినట్టు కాదని పేర్కొంది.


ఐఎన్ఏ సెక్షన్ 221 (జీ) (3), టీఎఫ్ఆర్ విధానం ద్వారా వీసా పొందిన విదేశీయులు అమెరికాకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఎయిర్‌పోర్టుల ద్వారానే ప్రయాణించాలి. బోస్టన్ లోగాన్, న్యూయార్క్ జాన్ ఎఫ్ కెన్నడీ, వాషింగ్టన్ డల్లెస్ (IAD) ఎయిర్‌పోర్టులను ప్రస్తుతం గుర్తించారు. నెవార్క్, అట్లాంటా, చికాగో ఓ'హేర్, లాస్ ఏంజెలెస్ వంటి మరికొన్ని విమానాశ్రయాలను త్వరలోనే ఈ జాబితాలో చేర్చనున్నారు. నిర్దేశించిన నిబంధనలను అనుసరించని వారికి అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించే అవకాశం ఉంది.


తమ వీసా గడువులోగా అమెరికాను వీడేవారికి బాండ్ కింద కట్టిన మొత్తాన్ని అధికారులు ఆటోమేటిక్‌గా తిరిగి వాపసు ఇస్తారు. ఒకవేళ, గడువు ముగిసినా వెళ్లకపోవడం (ఓవర్‌స్టే), ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను మార్చుకునేందుకు ప్రయత్నించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే బాండ్ మొత్తాన్ని అధికారులు జప్తు చేస్తారు. వీసా మినహాయింపు ప్రోగ్రామ్‌లోని దేశాల పౌరులకు ఈ కొత్త నిబంధన వర్తించదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్ట్‌ జనవరి 21 నుంచి 23 మధ్య ఆయా దేశాల పౌరుల వీసాల జారీకి అమలవుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa