ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం పూర్తి అయ్యేది ఎప్పుడు..?: శైలజనాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 12:46 PM

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంటులో ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని కూడా మోదీ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని శైలజనాథ్ ఆరోపించారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్, 2014–15 ఆర్థిక సంవత్సరపు నిధుల లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాలకు/ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ఇలా ఏ ఒక్క హామీని రకరకాల కారణాలు చూపిస్తూ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa