భారత దేశంలో ఆగస్టు 15 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని టెలికాం శాఖను ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. టెలికాం శాఖ కూడా పనులు వేగవంతం చేసింద. 5జీ స్పెక్ట్రంకు సంబంధించిన సిఫార్సులను మార్చి నెలాఖరుకు ట్రాయ్ను కోరింది. వివిధ బ్యాండ్లలో లభ్యమయ్యే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ధరలు, పరిమాణం, ఇతర షరతులకు సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ చేయనుంది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే పెను మార్పులు సంభవించనున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ స్పీడుతో పోలిస్తే ఇంటర్నెట్ స్పీడ్ 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఇదిలా ఉండగా 5జీ స్పెక్ట్రమ్ వేలానికి ట్రాయ్ ఏర్పాట్లు శరవేగంగా చేస్తోంది. 700 ఎమ్హెచ్జెడ్ నుంచి 526-698 ఎమ్హెచ్జెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వేలానికి నిబంధనలను ట్రాయ్ రూపొందిస్తోంది. టెలికాం కంపెనీలు సైతం 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 5జీ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa