ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో జిల్లాల విభజనకు ఏపీ సర్కారు మరో ముందడుగు వేసింది. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల విభజన చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో కొత్త జిల్లాలలో ఉద్యోగుల విభజన రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉంటుందని సర్కారు స్పష్టతనిచ్చింది. కొత్త జిల్లాలపై మార్చి 3వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. కొత్త జిల్లాలలో సమీకృత కలెక్టరేట్ల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త జిల్లాలపై రాయలసీమ నుంచి 1600 అభ్యంతరాలు వచ్చాయని, పరిశీలన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు. కొత్త జిల్లాలలో పరిపాలన ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. మార్చి 15 నుంచి 17 మధ్య కొత్త జిల్లాలలపై తుది నోటిఫికేషన్, మార్చి 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa