ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ సంచలన కామెంట్స్

national |  Suryaa Desk  | Published : Mon, Feb 28, 2022, 11:42 AM

ఐదు రాష్ట్రాల ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ప్రధానంగా యూపీలో జరుగుతున్న ఏడు దశల పోలింగ్ లో ఇప్పటికే ఐదు దశలు పూర్తయ్యాయి.ఇంకా రెండు దశల్లో పోలింగ్ కావాల్సి ఉంది. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. దేశ రాజకీయాలను ఈ ఎన్నికలు మార్చబోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. బీజేపీకి చెక్ పెట్టాలని ఎస్పీ వ్యూహాలు రచిస్తోంది. అయితే.. యూపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు.సమాజ్ వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ.. తన చావును సైతం కోరుకుంటున్నారంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణం కూడా ఉంది. గత సంవత్సరం మోదీ వారణాశిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. మూడు నెలలైనా వారణాశిలో ఉండొచ్చు… చివరి రోజుల్లో అందరూ వారణాశిలోనే గడపాలని కోరుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై వివాదం చెలరేగింది. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయన్న ఉద్దేశ్యంతో తాను ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందని అఖిలేశ్ వివరణ ఇచ్చారు. లెటెస్ట్ గా ఈ ప్రధాని మోదీ స్పందించారు.


 


చివరి రెండు దశల ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ వారణాశిలో పర్యటించారు. కొంతమంది నేతలు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని, ఏకంగా నా చావును కూడా కోరుతున్నారు.. అదీ వారణాశిలోనే కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రాణం పోయే వరకు ప్రజలకు సేవ చేసుకొనే భాగ్యం దక్కుతున్నందుకు ఆనందంగా ఉందని మోదీ వెల్లడించారు. ఇక యూపీ ఎన్నికల విషయానికి వస్తే… ఆదివారం ఐదో దశ పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం 5 గంటల సమయానికి 53.98 శాతం పోలింగ్ జరిగిందని భావిస్తున్నారు. 12 జిల్లాల్లో 61 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 692 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. మరో రెండు విడతల్లో ఓటింగ్ జరుగనుంది. మార్చి 10వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa