రాప్తాడు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారి బొమ్మేపర్తి ఆర్చ్ దగ్గర అనంతపురం వైపుకు వెళుతున్న ఒక వ్యక్తి లారీ కింద పడి చని పోయినాడు. అతని వయస్సు సుమారు 30-35 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. గుర్తు పట్టుటకు వీలు లేకుండా ఉన్నది. మృతదేహాన్ని అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించామని ఎస్ఐ బి. రాఘవరెడ్డి తెలియజేశారు.