ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిన్ను ఎవరైనా రేప్ చేసారా? అంటున్న వైసీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 12:14 PM

తల్లిని, చెల్లిని గౌరవించని జగన్ ని ఆదర్శంగా తీసుకున్న వైకాపన్లు మహిళల్ని కించపరుస్తూ, అవమానపరుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒక ఛానల్ డిబేట్ లో భాగంగా జగన్ రెడ్డి పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని టిడిపి యువ మహిళా దళిత నాయకురాలు గ్రీష్మ ఆరోపించారు. సమాధానం చెప్పలేని వైసిపి నేత నవరత్నాలు కొత్త ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌ అంకంరెడ్డి నాగనారాయణ మూర్తి (వైఎస్‌ఆర్‌సీపీ) మాట్లాడుతూ ...  నువ్వు ఏపీలోనే ఉంటున్నావా? నిన్ను ఎవరైనా రేప్ చేసారా? నిన్ను మెంటల్ హాస్పటల్ లో చూపించాలంటూ సంస్కారహీనంగా మాట్లాడి మహిళల పట్ల వైసిపి వ్యవహరించే దుర్మార్గమైన తీరుని మరోసారి బయటపెట్టాడు. ఉచ్చనీచాలు మరిచి మాట్లాడుతున్న వైకాపన్లకి మహిళాశక్తి ఏంటోచూపించాల్సిన సమయం వచ్చింది అని ఆంధ్ర ప్రదేశ్ మహిళలకు టీడీపీ యువ నేత నారా లోకేష్  పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa