ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోరాహోరీ పోరులో చెన్నై ను చిత్తు చేసిన లక్నో జట్టు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 12:31 PM

నిన్న జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. తొలి విజయం కోసం చెన్నై సూపర్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య భీకరమైన యుద్ధమే జరిగింది. హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. 


ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాట్స్‌మెన్  చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రెచ్చిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(26 బంతుల్లో 40 పరుగులు), డికాక్(45 బంతుల్లో 61) కలిసి 99 పరుగులు చేసి లక్నో జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారు. వారిద్దరూ ఔటయిన తర్వాత ఎవిన్ లేవిస్ (23 బంతుల్లో 55 పరుగులు అందులో 3 సిక్సర్లు, 6 ఫోర్లు), ఆయుష్ బదోని (9 బంతుల్లో 19 పరుగులు, 2 సిక్సర్లు) ఫీల్డ్ లోకొచ్చి సిక్సర్లు, ఫోర్లతో స్టేడియంను హోరెత్తించారు. ఈ విజయంతో లక్నో ఈ సీజన్లో తొలివిజయాన్ని నమోదు చేయగా, చెన్నైకిది వరసగా రెండో ఓటమి. ఈ సీజన్ తొలి మ్యాచ్ల్లో కోల్కతా తో తలపడి ఓటమిపాలైన చెన్నై జట్టు ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోవడంతో చెన్నై జట్టు అభిమానులు నిట్టూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa