ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022: నేటి మ్యాచ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 12:35 PM

ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఈ రోజు జరగనున్న 8వ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ జట్టు తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం లో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లు పరిశీలిస్తే బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదనిపిస్తోంది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌పై మంచు ప్రభావం చూపుతున్నందున టాస్ కీలక పాత్ర పోషించనుంది.


మొదటి మ్యాచ్‌లో బెంగళూరును మట్టికరిపించిన పంజాబ్ కింగ్స్ తన విజయ పరంపరను కొనసాగించాలనుకుంటుంది. గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని విజయాల బాట పట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలో ఈ రెండు జట్లు 29సార్లు పోటీపడగా కోల్‌కతా నైట్ రైడర్స్ 19 మ్యాచ్‌లు, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌లు గెలిచాయి. పంజాబ్ తో పోలిస్తే కోల్కతా జట్టు దే పైచేయి గా కనిపిస్తుంది. దీంతో శుక్రవారం జరగబోయే మ్యాచ్ లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ తప్పదనిపిస్తోంది. అయితే బౌలింగ్‌, బ్యాటింగ్‌ లోనూ పటిష్ఠంగా ఉన్న కేకేఆర్‌పై విజయం సాధించాలంటే పంజాబ్‌ చెమటోడ్చక తప్పదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa