ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించిన ఐశ్వర్య

cinema |  Suryaa Desk  | Published : Wed, May 19, 2021, 03:12 PM

ప్రస్తుతం ఇండియాలో కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి పై పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా దేశంలో ఆర్థికవ్యవస్థకు చాలా నష్టం వాటిల్లింది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలకు అండగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమవంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సౌత్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. తనవంతుగా తమిళనాడు ప్రభుత్వానికి లక్షరూపాయలు విరాళం ప్రకటించింది. అలాగే మరో లక్షరూపాయలు ఎఫ్ఈఎఫ్ఎస్ఐ యూనియన్ కు విరాళం అందించినట్లు సమాచారం. మరి ప్రస్తుతం పరిస్థితిలో ప్రతి ఒక్కరూ స్పందించి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉందని ఐశ్వర్య తెలిపిందట. ఈ విషయం పక్కనపెడితే.. ఐశ్వర్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. అందం గ్లామర్ అనే అంశాలు కాకుండా అభినయం పరంగా ఆకట్టుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది ఐశ్వర్య.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa