ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోసాని వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 29, 2021, 10:43 PM

ప్రముఖ నటుడు వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి ఇటీవల పవన్ కళ్యాణ్ పై బూతులతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇది సినీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై తాజాగా సీనియర్ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. పోసాని వ్యాఖ్యలను ఖండిస్తూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. మనం ఎప్పుడూ కూడా నోరు జారి మాట్లాడకూడదని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఒక్కసారి నోరుజారి మాట్లాడితే ఆ మాట మనం ఏమాత్రం వెనక్కి తీసుకోలేదు.  పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడడం అనవసరమైన విషయం అని అన్నారు. ఆయన మాట్లాడిన విధానంపై ఏదైనా తప్పు ఉంటే ఆ మార్గంలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.కానీ అనవసరంగా పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలపై కుటుంబ సభ్యులపై తప్పుగా మాట్లాడడం అనేది చాలా తప్పు అని తమ్మారెడ్డి అన్నారు.


పవన్ కళ్యాణ్ పై పర్సనల్ గా అటాక్ చేయాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ గా ఎటాక్ చేయాలంటే చేయండని.. పార్టీ పనితీరుపై అలాగే తన విధానాలపై ఏదైనా ప్రశ్నిస్తే బాగుంటుందని వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.


పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లపై ప్రశ్నించాడని.. సినీ ఇండస్ట్రీలో సమస్యలపై అడిగాడని.. అదే సమాధానం ఇవ్వాలని..కానీ పర్సనల్ విషయాలపై కామెంట్ చేయడం అనేది చాలా తప్పు అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. గతంలో కత్తి మహేష్ కూడా ఇదే తరహాలో పర్సనల్ మేటర్ పై కామెంట్ చేశాడని.. ఒకరికి సంస్కారం లేకపోతే మరొకరికి అయినా సరే సంస్కారం ఉండాలని తమ్మారెడ్డి అన్నారు. ఒకరు అన్నారని మనం కూడా ఇతరుల పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa