మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ తొలిసారి మెగాఫోన్ పట్టి చేసిన చిత్రం లూసీఫర్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం 2019 లో మలయాళంలో విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదేపేరుతో తెలుగులోకి కూడా డబ్ అయ్యిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ గాంధీ రూపకల్పనలో ఈ మూవీ తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది. తాజాగా సీక్వెల్ కు సంబంధించిన మేజర్ అప్డేట్ ను పృథ్విరాజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. L 2 ఎంపురాన్ పేరుతో రూపొందబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ పూర్తైనట్టు ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేసారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రానికి మురళి గోపి రచయితగా పని చేసారు. ఇక, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా 2023 ప్రథమార్థంలో విడుదలకానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa