ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరివీ ప్లాస్టిక్ ముఖాలే... వైరలవుతున్న రాధికా ఆప్టే వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Mon, May 30, 2022, 10:34 PM

రాధికా ఆప్టే... వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో, 2010లో వచ్చిన రక్త చరిత్ర తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రాధికా ఆప్టే. ఆ పై తెలుగులో రక్త చరిత్ర 2, బాలయ్య లెజెండ్, లయన్ సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ కు చేరువైన ఈ భామ ఇక అప్పటి నుండి తెలుగు సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం, విక్రమ్ వేద తమిళ రీమేక్ ను హిందీలో చేస్తుంది రాధికా. ఇదేగాక మోనికా! ఓహ్ మై డార్లింగ్ అనే నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లో రాధికా లీడ్ రోల్ లో నటిస్తుంది. 


ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా ఇతర హీరోయిన్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. హీరోయిన్లందరూ ముఖానికి కాస్మొటిక్ సర్జరీలు చేయించుకున్నవారే అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో అలాంటి ముఖాలను చూసి, చూసి తనకు చిరాకు వచ్చిందని చెప్పింది. కొంతమంది హీరోయిన్లైతే, ముఖానికి మాత్రమే కాక శరీర భాగాలకు కూడా సర్జరీలు చేయించుకుంటారని తెలిపింది. కొంతమంది హీరోయిన్లు  వయసుతో పోటీ పడలేక శరీరంతో పోటీ పడుతున్నారని రాధికా ఆప్టే పేర్కొంది. రాధికా చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa