తెలుగు ఆడియన్స్ కి తమిళ హీరో కార్తీ గురించి పరిచయం అవసరం లేదు. ఈ స్టార్ హీరోకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కార్తీ చివరిగా ఇటీవలే విడుదలైన 'సుల్తాన్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో 'సర్దార్' సినిమా సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమా లో రాశి ఖన్నా, రజిషా విజయన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, భారతదేశంలో మొదటిసారిగా అజర్బైజాన్ పార్లమెంటులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్లో విలన్గా చుంకీ పాండే నటించాడు. ఈ చిత్రంలో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
![]() |
![]() |