ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైత్రి సంస్థలో మలయాళ హీరో డిబట్ ఎంట్రీ... త్వరలోనే అధికారిక ప్రకటన?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 12:48 PM

మలయాళ స్టార్ హీరోగా, టాప్ డైరెక్టర్ గా రెండు పాత్రలను పోషిస్తూ... రెండిట్లోనూ సూపర్ సక్సెస్ ఐన పృథ్విరాజ్ సుకుమారన్ త్వరలోనే తెలుగులో నటించబోతున్నాడు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే పృథ్విరాజ్ డేట్స్ ను బుక్ చేసుకుందట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని వినికిడి. అన్ని అంశాలు కలిసొస్తే, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రావొచ్చంట.
పృథ్విరాజ్ నటించిన కొత్త చిత్రం "కడువా" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈ మేరకు మీడియాకిచ్చిన పలు ఇంటర్వ్యూలలో పృథ్విరాజ్ మాట్లాడుతూ... త్వరలోనే తెలుగులో నటించే అవకాశాలున్నాయని, ఆపై దర్శకత్వం కూడా చేస్తానని చెప్పారు.
మలయాళంలో పృథ్విరాజ్ నటించిన అయ్యప్పనం కోషియం సినిమాను పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అలానే పృథ్విరాజ్ మొదటిసారి మెగాఫోన్ పట్టి చేసిన లూసిఫర్ మూవీని మెగాస్టార్ గాడ్ ఫాదర్గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa