శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ "రామారావ్ ఆన్ డ్యూటీ" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా జులై 19న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పీరియాడికల్ డ్రామాగా సాగే ఈ సినిమా 1995 నేపథ్యంలో సాగుతుందని శరత్ చెప్పారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్ర లోకేష్ మరియు జాన్ విజయ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.