ఫణి కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. క్రేజీ ఫెలో అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఈ సినిమాకి లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. పోస్టర్లో హీరోయిన్లిద్దరూ అందంగా కనిపిస్తుండగా ఆది ఫుల్ ట్రెండీగా కనిపిస్తున్నారు. కే కే రాధా మోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత అందిస్తున్నారు.